ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధి పేర్నమిట్ట సమీపంలో కోళ్ల పందెం స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈగల్ టీం సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి, 11 మంది కోడిపందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద రూ.5410 నగదు, 2 కోళ్లు, 3 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. దాడిలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.