యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆదివారం సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో వాలీబాల్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ, అన్నింటికంటే వాలీబాల్ అద్భుతమైన క్రీడ అని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ప్రశాంతత ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.