కుప్పం: కన్నుల పండుగగా శరన్నవరాత్రి ఉత్సవాలు
కుప్పంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభం అయ్యాయి. పట్టణంలోని గంగమ్మ ఆలయం, ప్యాలస్ రోడ్డు కూడలి, రామచంద్ర రోడ్డు, మురుగన్ టాకీస్ రోడ్డు, శ్రీదేవి పీఠం, కొత్తపేట శ్రీ కన్యక పరమేశ్వరి, పాతపేట శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మొదటిరోజు బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.