నంద్యాల విజయ మిల్క్ డైరీ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించేందుకు వెళుతున్న ఇద్దరు ఉద్యోగులను ఆళ్లగడ్డలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్పందించారు. ఆళ్లగడ్డ టౌన్ స్టేషన్ సీ.ఐ యుగంధర్ ను కలిసి సంఘటన పూర్వాపరాలను ఆయన వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనాగరిక పాలన కొనసాగుతున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మిల్క్ డైరీ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించేందుకు వెళుతున్న ఉద్యోగులు టిఫిన్ చేస్తుండగా