గన్నవరం: కోడుమూరు మండలం గొల్లపాలెం సమీపంలో కారు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కృష్ణాజిల్లా కోడుమూరు మండలం గొల్లపాలెం సమీపంలో గురువారం కారు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్ లో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు గాయపడ్డ వ్యక్తిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.