నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ఎల్లనూరులో టీడీపీ -వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇరువర్గాలకు చెందిన ఎనిమిది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మొదట తాడిపత్రి ఆసుపత్రికి అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి గాయపడిన వారిని తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. అండగా ఉంటానని అధైర్యం పడవద్దని భరోసా కల్పించారు.