తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారికి ఓయూలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థి సంఘాలన్నీ సాయి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆదుకోవాలని కుటుంబానికి కోటి రూపాయల నగదు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.