రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో దొంగలు పడ్డారు. కిరాణా కొట్టు నడుపుతున్న సునీతమ్మ మెడలోని 45 గ్రాముల బంగారు మాంగల్యం చైర్ లాక్కెళ్లిపోయారు. మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు యువకులు పల్సర్ బైక్ పై వచ్చి సిగరెట్, కూల్ డ్రింక్ అడిగారు. వంద రూపాయలు ఇచ్చారు. చిల్లర ఇచ్చేలోపే మెడలో చైన్ లాగి ఉడాయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.