రేణిగుంటలో విద్యుత్ స్తంభంపై కోతి మృతి రేణిగుంట వినాయకనగర్లో విద్యుత్ స్తంభంపై వారం రోజుల క్రితం కరెంట్ షాక్కు గురై కోతి మృతి చెందింది. దీన్ని విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. తీవ్ర దుర్వాసన వెదజల్లుతుండగా, లైన్మెన్ మాత్రం బిల్లులు వసూలు చేయడంలో మాత్రమే బిజీగా ఉన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో స్పందించి కోతి శవాన్ని తొలగించాలని కోరుతున్నారు.