రాజంపేట: వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు
రాజంపేట టిడిపి నేత చమర్తి జగన్మోహన్ రాజు మంగళవారం వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించారు. కులపుత్తూరు శివాలయం వద్ద చేయూనది ఉద్ధృతిని ఆయన పరిశీలించారు నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆయన కోరారు వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.