Public App Logo
Profile Picture

మన ప్రకాశంజిల్లా వార్తలు

@usr00403898
1Followers
0Following
నంద్యాల  జిల్లా సంగమేశ్వరం దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ లో జలాధివాసానికి చేరువలో ఉన్నది...

👉శ్రీశైలం ప్రాజెక్ట్  లో ప్రస్తుతం 849.6  అడుగులు నీటి మట్టం ఉన్నది..

👉841 అడుగులు చేరుకోగానే గర్భ గుడిలోకి నీళ్లు ప్రవేశిస్తాయి.867 అడుగులు శ్రీశైలం నీటి మటం చేరగానే గుడి మొత్తం మునిగిపోతుంది.మరల 8 నెలలు తరవాత దర్శనం.
*ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం* 

 *మార్కాపురం జిల్లా గిద్దలూరు–నంద్యాల ఘాట్ రోడ్డులో సోమవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఒకదానికొకటి అత్యంత సమీపానికి రావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి డ్రైవర్లకు సూచనలు ఇవ్వడంతో ఇరువాహనాలను జాగ్రత్తగా వెనక్కి తీసి మార్గాన్ని సర్దుబాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు.

ఘాట్ రోడ్డులో మలుపులు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, అనంతరం ట్రాఫిక్ యథావిధిగా* పునరుద్ధరించారు.
Video 2
Video 3
Video 4
*దోర్నాల : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళపై మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ విజయ సునీత...*
*మార్కాపురం జిల్లా కంభంలో అక్రమ కట్టడాలు తొలగింపు. హైవేకి ఇరువైపులా ఉన్న  ఆక్రమణలు తొలగించిన అధికారులు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉండడంతో ఆక్రమణలపై ఉక్కుపాదం..
తర్లుపాడు
*వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై కలెక్టర్ విజయ సునీత క్షేత్రస్థాయి పరిశీలన... టీబీఎం వర్క్స్ ని పరిశీలించిన కలెక్టర్... ఆగస్టు 31 నాటికి పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 1న ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహాలు...*
8 ఏళ్ల నిరీక్షణ తర్వాత పుట్టిన బిడ్డ కోసం... తన ప్రాణాన్నే అర్పించిన తల్లి! 😭🙏 మార్కాపురం (D) కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ గారి త్యాగం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. తాను లేకపోయినా తన బిడ్డ బ్రతకాలనే చివరి కోరికతో మాతృత్వానికి నిజమైన అర్థం చూపించారు. ఈ త్యాగానికి ఒక ❤️ నివాళి అర్పిద్దాం
*మార్కాపురం జిల్లా గొబ్బూరు వద్ద పొగాకు రైతుల ఆందోళన.. వేలం కేంద్రాలకు తీసుకువచ్చిన పొగాకు ను వెనక్కి తిప్పి పంపడం పై రైతుల ఆగ్రహం.. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్..
*మార్కాపురం జిల్లా...*

*పొదిలి మండలం గురుగుపాడు ఉపాధి కూలీల ఆందోళన...*

*పని కల్పించాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఉపాధి హామీ కూలీలతో ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జున డిమాండ్...*

*ఒక్కొక్కరు 400  ఇస్తేనే పనిలోకి రండి లేకపోతే పని లేదంటూ ఉపాధి హామీ కూలీలకు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జున.,.*

*పొదిలి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీల నిరసనతో ఆందోళన...*

 *న్యాయం చేయాలంటూ ఎంపీడీవోకి వినతిపత్రం అందించిన ఉపాధి హామీ కూలీలు...*
దోర్నాల మండలం మొట్ల మల్లికార్జున పురం సమీపంలో  బొలెరో స్కూల్ బస్సు ఢీ బోలారో ఒక వ్యక్తి మృతి 10మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు
Video 13