Public App Logo
Profile Picture

మన ప్రకాశంజిల్లా వార్తలు

@usr00403898
5Followers
0Following
*వెలిగొండ ప్రాజెక్ట్ సొరంగాల వెనకవైపు ఉన్న కొల్లం వాగు.. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఈ కొల్లం వాగు నుండే వెలిగొండ ప్రాజెక్ట్ రెండు సొరంగాల నుండి నల్లమల సాగర్ కు చేరుతాయి.*
వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు మరో 250 కోట్ల పరిహార చెక్కును అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
*తర్లుపాడు మండలం సీతనాగులవరం గ్రామం లో హియరింగ్ సర్ ప్రక్రియను పరిశీలించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ యం విజయ సునీత*
Video 3
శ్రీశైలం దేవస్థానం సీఎస్‌వో తొలగింపు
ఒంగోలు సూర్య టవర్స్ లో  వినీత కుమార్తే మనువడు తో లిఫ్ట్ దిగుతుండగా డోర్స్ వేయకుండానే లిఫ్ట్ కదలడం తో మధ్యలో ఇరుక్కొని ఉన్న ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది
ఆర్ అండ్ ఆర్ యాక్టును పటిష్టంగా అమలు చేయండి 

ఆరు నెలలు సమయం ఇవ్వాలని యాక్టులో ఉంది

లక్ష్మీపురం గ్రామాన్ని 24న ఖాలీ చేయిస్తే అడ్డుకుంటాం.. గిద్దలూరు వైయస్ఆర్సీపీ ఇన్ఛార్జీ. మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

 మార్కాపురం

వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైతున్న కాకర్ల గ్యాప్ లోని మాగటూరు తాండలోని లక్ష్మీపురం, కృష్ణానగర్ గ్రామాల వారికి పూర్తి స్థాయిలో ఆర్ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించి 6నెలల సమయం ఇచ్చి ఖాలీ చేయించాలని, అలా కాకుండా బలవంతంగా, దౌర్జన్యంగా కాళీ చేయిస్తే అడ్డుకుంటామని గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి హెచ్చరించారు. నిర్వసితులతో కలిసి ఆయన గురువారం కలెక్టర్ విజయసునీతను కలిశారు. నిర్వసితుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మిడియాతో మాట్లాడూతూ 2013 ఆర్ఆర్ యాక్టులోని 38వ క్లాజ్ ప్రకారం నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చి 6నెలలు గడువు ఇవ్వాలని ఉందని, చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్ళాలన్నారు. ఈనెల 24న అధికారులందరూ ఆ గ్రామాలనికి వెళ్ళి ఎలాగైన కాలీ చేయిస్తామని చెపుతున్నారని, అలా చేస్తే తాము అడ్డుకుంటామని చెప్పారు. 2019లో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కటాఫ్ తేదిని పెంచి నిర్వాసితులకు న్యాయం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం కూడా నీళ్ళు వదిలే తేదిని కటాఫ్ డేట్గా తీసుకుని ఆర్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మీపురం గ్రామంలో సుమారు 500 ఎకరాలలో లక్షాలాధి రూపాయలు ఖర్చుపెట్టి పంటలు వేశారని, ఉన్న ఫలంగా కాలీ చేయమంటే వారి పరిస్థితి ఎంటన్నారు. ఈ గ్రామాలలో సుమారు 500 నుంచి 600 వరకు పశువులు ఉన్నాయని వారందరు ఇళ్ళను కాలిచేసి ఎక్కడ ఉండాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైన పునరాలోచించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తమ ఉపాధ్యాయినికి కలెక్టర్ అభినందన..

 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రం లో 10 వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 10 పాఠశాలలను గుర్తించి ఆయా పాఠశాల లకు చెందిన ప్రధానోపాధ్యాయులకు అవార్డు లను అందజేసింది. అందులో భాగంగా మార్కాపురం జిల్లా అర్ధవీడు మండల కేంద్రం లోని జడ్పీ ఉన్నత పాఠశాల కు బెస్ట్ యావరేజ్ లో ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉత్తమ ఫలితాల సాధనకు విశేష కృషి చేసిన అంధురాలైన ప్రధానోపాధ్యాయిని సుజాత దంపతులను ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత  కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్ లో ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా భవిష్యత్ లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించి మరింత మందికి స్ఫూర్తి గా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో డీఈవో సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
*తర్లుపాడు మండలం లో విస్తృతంగా పాఠశాలలను అకస్మికంగా  తనిఖీ చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి సామా సుబ్బారావు గురువారం నాడు తర్లుపాడు మండలం కేతగుడిపి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను సందర్శించి రాగి జావ ను స్వయంగా తాగి పరిశీలించారు*
వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలు కన్నీటి పర్యంతం నడుమపాత జ్ఞాపకాలు తమ పుట్టుక ఉనికి కోల్పోతూ ఒక్కొక్కరుగా చిన్న చితక ముసలి ముతక ఖాళీ చేసి వెళ్తున్నారు
తర్లుపాడు మండలం తుమ్మలచెరువు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజనము ను పరిశీలించిన మార్కాపురం జిల్లా డి ఈ ఓ సామా సుబ్బారావు*
Video 11
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడులు 

 నూతన ఇంటికి ఇంటి పన్ను వేసేందుకు 15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ నరేంద్ర 

 ప్రత్యేకత ఏమిటంటే ఇతను రెండోసారి ఏసీబీకి దొరకడం..
**శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్‌ను పరిశుభ్రంగా ఉంచాలి: తర్లుపాడు ఎస్.ఐ బసవరాజు హెచ్చరిక**

**తర్లుపాడు:**
మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్‌లో గల శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్‌లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తర్లుపాడు ఎస్.ఐ బసవరాజు హెచ్చరించారు.పార్క్‌లో చెత్త వేసినా, మలమూత్ర విసర్జన చేసినా, అలాగే మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్క్ పరిసర ప్రాంతాల ప్రజలకు, తాగే నీటి ట్యాంక్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీహరి మాట్లాడుతూ... పార్క్ ఆవరణలో చెత్త వేయడం, మద్యం సేవించడం, మలమూత్ర విసర్జన చేయడం లాంటి పనులు పునరావృతం చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, భారీగా జరిమానా కూడా విధిస్తామని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో  శ్రీశైలం వాసవి సముదాయ సత్రం కార్యదర్శి పోలేపల్లి జనార్దన్, వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర్, గ్రామ ప్రజలు దోగిపర్తి మల్లిఖార్జున, భవనం రామకృష్ణ రెడ్డి,చెక్కా బాలరంగం, గాదం శెట్టి సుబ్బారావు జవ్వాజి వెంకటేశ్వర్లు, గునుపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
*మార్కాపురం జిల్లా కంభం నీటి పారుదల శాఖ ఆఫీస్ ముందు ఔరంగాబాద్ రైతుల నిరసన. చెరువు నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో అధికారుల పై ఆగ్రహం..."Ntv"*
*మార్కాపురం జిల్లాలో మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రెండు పూటలా ఆహారం అందించే కార్యక్రమాన్ని సుభోజనం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టాయి. బేస్తవారిపేట మండలంలో 12 గ్రామాల్లో 64 మందికి ఆహారం అందిస్తున్నామని చైర్మన్ కామూరి రమణారెడ్డి తెలిపారు..
Video 16
మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు...వరుస సెలవులు కావడంతో మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు... గణపతి చెక్ పోస్ట్ వద్ద నుండి శ్రీశైలానికి బారులు తీరిన వాహనాలు...వాహనాల రాకపోకలను క్లియర్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు
Video 18
మార్కాపురం జిల్లా కలెక్టర్ బంగ్లా లో కలెక్టర్ విజయ సునీత ఆహ్వానం మేరకు ఎట్ హోమ్ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి, గూడూరి ఏరిక్షన్ బాబు, ఇమ్మడి కాశీనాధ్, జెసి పులి శ్రీనివాసులు, పి వి కృష్ణారావు
మార్కాపురం జిల్లా కేంద్రం లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఎగరవేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, ఆర్ అండ్ ఆర్ పురోగతి పై మంత్రులు నిమ్మల రామానాయుడు, Anam Ramanarayana Reddy, లు ఎమ్మెల్యేలు, అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులతో వారి సమస్యలపై చర్చించడం జరిగింది. సమీక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడటం జరిగింది. ఈ సమావేశం లో ఎమ్మెల్యే లు Kandula Narayana Reddy , Kakarla Suresh , Ugra Narasimhareddy Mukku , Muthumula AshokReddy , యర్రగొండ పాలెం టీడీపీ ఇంచార్జి ఎరీక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్, ఓఎస్డి నవ జ్యోతి మిశ్రా, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, వెలిగొండ ప్రాజెక్ట్ సిఈ రమేష్, ఎస్ఈ అబుతాలేం, మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. <nis:link nis:type=tag nis:id=veligonda nis:value=Veligonda nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=veligondaproject nis:value=VeligondaProject nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nimmalaramanaidu nis:value=NimmalaRamaNaidu nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chandrababunaidu nis:value=ChandrababuNaidu nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=naralokesh nis:value=NaraLokesh nis:enabled=true nis:link/> PawanKalyan
Video 22
మార్కాపురం జిల్లా కంభం మండలం కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనానికి పాల్పడిన ఎనిమిది మందిని వారి వద్ద నుంచే 13 బైకులను స్వాధీనం చేసుకుని కోర్టుకు సబ్మిట్ చేసిన కంభం పోలీసులు..
పుల్లలచెరువు మండలం గంగవరం విఆర్ఓ బాషా రైతు వద్ద నుంచి 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పండుపడ్డ vro