బ్రహ్మోత్సవాలు, జాతరలు, పర్వదినాల్లో దేవాలయాల్లో ఎక్కువ మంది ప్రజలు గుమిగూడె అవకాశం ఉన్న సందర్భాల్లో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని పోలీస్, రెవెన్యూ, ఫైర్, శానిటేషన్ తదితర యంత్రాంగానికి తెలిపి సమన్వయం చేసుకొని నిర్వహించాల్సి ఉంటుందని, పూర్తి బాధ్యతగా దేవాదాయ శాఖ, మైనారిటీ సంబంధిత అధికారులు వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు ఎస్పీ జగదీష్ సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు.కొన్ని జిల్లాల్లో ముఖ్యమైన పండుగలు, బ్రహ్మోత్సవాల్లో గతంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.