అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో బుధవారం రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో జరిగే శ్రీ బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా నిర్వహించే పోటీలలో మొదటి రోజు పాల పళ్ళ విభాగంలో పోటీలు జరిగాయి. పోటీలలో మొత్తం 28 జతల వృషభాలు పాల్గొన్నాయి. పోటీలలో కర్నూలు, కడప, నంద్యాల, ఒంగోలు, ఎన్టీఆర్ జిల్లా ల నుంచి వృషణాలు పాల్గొన్నాయి. పోటీలు చూసేందుకు భారీ ఎత్తున రైతులు, అభిమానులు తరలివచ్చారు.