సంతనూతలపాడు మండలం తక్కెళ్ళపాడు లో ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని దళితవాడను సందర్శించి అధ్వానంగా ఉన్న రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితవాడల అభివృద్ధి పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు. దళితవాడల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ తక్కెళ్ళపాడు లో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.