నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో అగ్నిప్రమాదం కలకలం రేపింది.శ్రీశైలం రేంజ్ పరిధిలోని పెచెర్వు అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగి వేగంగా విస్తరిస్తోంది.అడవిలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రొటెక్షన్ వాచర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదుపులోకి తేవడానికి వెళ్లిన ప్రొటెక్షన్ వాచర్లకు కూడా ప్రమాదం తప్పలేదు.మంటల్లో ప్రొటెక్షన్ మాచర్ల కు చెందిన మూడు మోటార్ బైకులు దగ్ధమయ్యాయి.