నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని బుధవారం26వ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అర్జీలకు చట్టపరంగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు.