అనంతపురం జిల్లా సింగనమల మండలం గురు గుంటలో బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ. ఘర్షణలో ఓబులేసు, జయమ్మ భార్యాభర్తలకు తీవ్ర గాయాలు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఓబులేష్, జయమ్మ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ శ్యామ్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సింగనమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.