కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నంపల్లికి చెందిన రామ్మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబ సమస్యలతో బాధపడుతుండే వాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రామ్మోహన్ రెడ్డి శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.