నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 24.09.2023 తేదీనాడు తెల్లవారుజామున మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళపై నిందితుడు అత్యాచారం నేరం చేశాడని బాధితురాలు కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుదీర్ఘ విచారణ అనంతరం కర్నూలు స్పెషల్ అడిషనల్ సెషన్స్ కోర్టు సదర ముద్దాయికి యావ జీవ కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా ను విధిస్తూ గురువారం తీర్పునివ్వడం జరిగింది