పత్తికొండ: వెల్దుర్తి మండలం లో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
వెల్దుర్తి మండలం కలుగోట్లలో వ్యవసాయ అప్పులు, పంట నష్టంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బోయ మద్దయ్య (55) ఆదివారం వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తనకు ఉన్న 2 ఎకరాలతో పాటు దేవుని మన్యం కౌలుకు తీసుకొని సాగు చేశారు. పంట నష్టం వాటిల్లి రూ.6 లక్షలు అప్పులు మిగిలాయి. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య లక్ష్మీదేవి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.