అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం పి యాలేరు గ్రామంలో ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గాయపడిన నాగభూషణం అనే వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.