వి.కోట: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఎమ్మెల్యే అమర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల బలోపేతానికి పటిష్టమైన విద్యావ్యవస్త కు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం క్రింద విద్యార్థుల తల్లుల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేయడం జరిగిందని పలు కీలక విషయాలు వెల్లడించారు.