గుంతకల్లు: గుత్తి పట్టణంలోని గుడ్ షెపర్డ్ పాఠశాల సమీపంలో రెండు ఇళ్లలో పట్టపగలే చోరీ, ఆరు తులాల బంగారు, రూ.23వేలు చోరీ
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలోని రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని గుడ్ షెపర్డ్ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్, ఆర్మీ ఉద్యోగి నరేంద్ర రెడ్డి ఇళ్లలో చోరీ జరిగింది. ప్రవీణ్ కుమార్ ఇంట్లోని బీరువాలో రూ.18వేలు, మూడు తులాల బంగారు, నరేంద్ర రెడ్డి ఇంట్లో మూడు తులాల బంగారు, రూ.5వేలు నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.