అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో గురువారం మూడు గంటల 35 నిమిషాల సమయంలో ఉపకులపతి సుదర్శన్ రావు నిగం ఫౌండేషన్ యువజన వ్యవహారాలు క్రీడలు మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ప్రగతి పదం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నషా ముక్తి భారత్ పరివర్తన గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ నిగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరివర్తన ద్వారా యువతకు మానసిక ఆరోగ్యం మారకద్రవ్యాలు నివారణ పై అవగాహన కల్పించడం శుభ పరిణామం అని జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిగం ఫౌండేషన్ ప్రతినిధులు అంతా పాల్గొన్నారు.