అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద సోమవారం 12 గంటల 15 నిమిషాల సమయంలో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ చేయాలని దళిత సంఘాలతో కలిసి విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి నివాళులర్పించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత విద్య వైద్యం వ్యవసాయ పరికరాలు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు విదేశాలనుంచి నిధులు వచ్చేందుకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ ఓబులేష్ హెచ్చరించారు .