అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం విరుపాపురం గ్రామ శివారులో రోడ్డుపై జింక అడ్డు రాగా తప్పించబోయి బైక్ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లికి చెందిన రామాంజనేయులు, విష్ణులు పని నిమిత్తం గుత్తికి వచ్చి తిరిగి వెంకటాంపల్లికి బయలుదేరారు. అయితే విరుపాపురం శివారులో గురువారం రాత్రి బైక్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా జింక రోడ్డుపైకి రావడంతో తప్పించబోయి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.