నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్నం గీతా వీధికి చెందిన శిల్పి షేక్ బాషా కుమార్తె సోనియా గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల ప్రముఖ శిల్పి రవీంద్ర చారి హర్షం వ్యక్తం చేశారు, శారద శిల్పకళా మందిరంలో, శిల్ప కళాకారులు సోనియాను సెల్వ కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా శిల్పి రవీంద్ర చారి మాట్లాడుతూ సామాన్య శిల్పి బిడ్డగా కష్టపడి చదివి ఈ విజయం సాధించడం శిల్పులందరికి గర్వకారణం అని అన్నారు, ఆమె నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు