అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం లో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మద్యం మత్తులో తల్లి రత్నమ్మ పై కొడుకు దాడి. రత్నమ్మకు కాలు విరగడంతో పుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. రత్నమ్మ ఇంటి దగ్గర ఉండగా కొడుకు దాడి చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.