రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతిరావు వివరాల ప్రకారం ఆముదాలపల్లికి చెందిన మణికంఠ కృష్ణ కుమార్ తెనాలి నుంచి ఆముదాలపల్లికి బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో బావాజీపాలెం దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు..