పిజిఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంలో మరింత పురోగతి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యు.ఎస్ అంశాలు, ఏపిఎంఐపీ, సానుకూల ప్రజా అవగాహన, అన్నాక్యాంటీన్లు, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఎస్డీసీలు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.