మార్కాపురం బస్సు ఘటన తర్వాత శ్రీశైలంలో అప్రమత్తమైన మోటార్ వెహికల్ అధికారులు, పోలీసులు.
మార్కాపురం ఘటన నేపథ్యంలో శ్రీశైలం లింగాలగట్టు సమీపంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి అధికారులు దిశానిర్దేశం చేశారు. ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సుల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ప్రాణనష్టం జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ప్రయాణ సమయంలో పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు వంటి ప్రమాదకర ఇంధనాలను బస్సుల్లో రవాణా చేయకూడదని హెచ్చరించారు. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో ముందుగానే గుర్తుంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమ