ఆర్ జంబులదిన్నె గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆర్ జంబులదిన్నె గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం లభించినట్లు ఏఎస్ఐ ప్రతాపరెడ్డి తెలిపారు, మంగళవారం 45 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటానికి స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారన్నారు, అక్కడికి వెళ్లి అతడిని 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు