కనిగిరి పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కనిగిరి డివిజన్లోని సిఐ లు, ఎస్సైలతో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ శనివారం నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో వారీగా యుఐ కేసులపై సమీక్ష నిర్వహించి, ఆ కేసులో తగ్గుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన శ్రీ శక్తి యాప్ పై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మహిళల చేత యాప్ ను డౌన్లోడ్ చేయించాలని డీఎస్పీ సూచించారు. గ్రామాల్లో దొంగతనాలు నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు