సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం ఈ ఏడాది 1,25,578 మందిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ ఆనంద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “అక్షరాంధ్ర” కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అనంతపురం నగరంలోని మున్నా నగర్ లో ఉన్న వయోజన విద్యా కేంద్రమును జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో మొత్తం 1,25,578 మందిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.