పుల్కల్: సింగూర్ ప్రాజెక్టుకు లక్ష పదివేల క్యూసెక్కుల వరద 11 గేట్లు ఓపెన్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు లక్ష 10వేల ప్రవహిస్తుందని డిఈఈనాగరాజు సోమవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు మరో గేటు ఎత్తి 11 గేట్ల ద్వారా దిగువకు లక్ష5వేల క్యూసెక్కుల వరద వదిలినట్లు తెలిపారు.