కోడూరు: మొద్దు నిద్రలేచి మామిడి రైతులని ఆదుకోండి: మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు
మామిడికాయ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంటను అలాగే వదిలేస్తున్నారని, కూటమి మొద్దు నిద్రలేచి మామిడి రైతులని ఆదుకోవాలని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు. . శనివారం మధ్యాహ్నం కోడూరు మాంగో యార్డ్ ను సందర్శించి, అక్కడ ఉన్న రైతులు, వ్యాపారస్థులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా అధికారులు రైతులు దగ్గరకి వచ్చి 4 రూపాయల ప్రభుత్వం తరపున ఇప్పిస్తామని చెప్పి వెళ్లిపోయారని ఇప్పటి వరకు ఒకరికి కూడా ఇవ్వలేదు అన్నారు.రైతులను ఆదుకోవాలని, లేని యెడల జాతీయ రహదారి పైన ధర్నాకు కూర్చుంటామని హెచ్చరించారు.