అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం 11:30 నుంచి 4:30 గంటల వరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణ అభివృద్ధి శాఖ ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన జీవన ప్రణాళించాలని పన్నులు వసూలు సక్రమంగా చేపట్టాలని మున్సిపాలిటీ అభివృద్ధిపై మేధో మదనం జరగాలని ఈ ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించామని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ పేర్కొన్నారు.