కనిగిరి పట్టణంలోని పాతూరులో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో బాలుడు అక్షయ్ కుమార్ రెండు చేతులు కోల్పోయాడు. ప్రమాదానికి గురైన ఆ బాలుడుని రాష్ట్ర శాలివాహన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బసవేశ్వర రావు ఆదివారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రెండు చేతులు కోల్పోయిన అక్షయ్ కు అండగా ఉంటామని, విద్య, వైద్య సహకారాన్ని అందిస్తామని బసవేశ్వర రావు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శాలివాహన సంఘ నాయకులు పాల్గొన్నారు.