శ్రీశైలం మల్లన్న ఆలయం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేయబడింది. ఈరోజు వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు,మహామంగళహారతులు నిర్వహించారు.తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు భక్తులకు అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు.ఉదయం 6 గంటల నుంచి ప్రధాన ఆలయం, ఉభయ దేవాలయాలు మరియు పరివార ఆలయాల ద్వారాలు మూసివేశారు. సాయంత్రం 7:30 గంటలకు తిరిగి ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించనున్నారు. రాత్రి 9 నుంచి 10:30 వరకు భక్తులకు అలంకార దర్శనం కల్పించనున్నారు.గ్రహణం నేపథ్యంలో ఈరోజు ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు, కల్యాణోత్సవం, అన్నప్రసాద వితరణ నిలిపారు.