ఆదోని: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన నిరాహార దీక్ష, మద్దతు తెలిపిన ఐదు నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్చార్జులు
Adoni, Kurnool | Dec 3, 2025 ఆదోని జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం 18వ రోజుకు చేరుకుంది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ బాబు, ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జులతో కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఈ జిల్లా ఉద్యమానికి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.