భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు బడుగు బలహీన వర్గాల భాగ్య విధాత, యావత్ దేశానికి దిక్సూచి.. భారతరత్న మన డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, వారి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అని.. ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు.శనివారం ఉదయం 11 గంటల సమయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహానీయునికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.