నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం విజయభాస్కర్ ఆధ్వర్యంలో.. ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్స్, యూనిఫామ్, మధ్యాహ్న భోజన పథకం అందించడం జరుగుతుందని, బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో జరిపించాలని సూచించారు.