గత ప్రభుత్వం లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని రాష్ట్ర మంత్రి టీజీ. భరత్ అన్నారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు లో బీసీ భవన్ మరియు కాపు భవన్ నిర్మిణాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. నగరంలోని బీ.క్యాంపు లో 2014-19 సంవత్సరంలో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వంలో బీసీ, కాపు భవన్ లకు నిధులు కేటాయించి పనులు ప్రారంభం అయ్యాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణాల పనులు నిలిపివేసి నిధులు పక్క దారి పట్టాయి. నేడు మంత్రి భరత్ ఆధ్వర్యంలో భవన నిర్మాణాల పనులు పునఃప్రారంభం చేశారు.