ఇతర కులస్తులను ఎస్టీ జాబితాలోకి చేరిస్తే అడ్డుకొని తీరుతామని గోర్ బంజారా రాష్ట్ర నాయకుడు కైలాష్ నాయక్ అన్నారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా గోర్ బంజారా జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజనులకు వసతులను కల్పించి,అండగా నిలవాలని డిమాండ్ చేశారు.