ఇటీవల కాలంలో రాయదుర్గం మీదుగా కర్నాటక ప్రాంతాలకు గోవుల అక్రమ రవాణా సాగుతోందని గోరక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. టెంపోలు, లారీలలో రాత్రి వేళల్లో పోలీసుల కళ్లు గప్పి గోవులను అక్రమంగా తరలిస్తుండగా గో రక్షకులు 2 రోజుల క్రితం అడ్డగించారు. వధశాల విధించేందుకు గోవులు తరలిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులు, చెక్ పోస్టు నిర్వాహకులు వారిపై తగిన నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.