నాగులుప్పలపాడు మండలం బి. నిడమానూరులో గురువారం ప్రమాదవశాత్తు పొగాకు బ్యారన్ లో మంటలు వ్యాపించి బ్యారన్ పూర్తిగా దగ్ధమైంది. బ్యారన్ లో పొగాకుకు క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకుని బ్యారన్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.