అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని జగ్జీవన్ రామ్ కాలనీలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు మహిళ యత్నించింది. అందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని జగ్జీవన్ రామ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు, సుజాత దంపతుల కుమారుడు విగ్నేష్ ను గుర్తుతెలియని మహిళ శుక్రవారం ఎత్తుకెళ్తుండగా కాలనీవాసులు గమనించారు. కాలనీలో భిక్షటన చేసుకుంటూ వచ్చిన మహిళ ఇంటి బయట ఆడుకుంటున్న విగ్నేష్ ను ఎత్తుకెళ్లి ఎందుకు ప్రయత్నం చేసింది. స్థానికులు గమనించి మహిళను దేహశుద్ధి చేసి బాలుడిని రక్షించారు