అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో గంజాయి ముఠా దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి వ్యతిరేకంగా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి ఐద్వా గుంతకల్లు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. పట్టణంలోని హంపిరెడ్డి భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఎక్సైజ్ పోలీసులు, విద్యార్థినులతో కలిసి ఐద్వా మహిళ నాయకులు గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా మహిళ సంఘం పట్టణ అధ్యక్షురాలు జ్యోతి, కార్యదర్శి రంగమ్మలు మాట్లాడారు.