శ్రీ సత్యసాయి జిల్లా పరిగి సమీపాన ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రామగిరి మండలం పేరూరు కు చెందిన హనుమంతు, ముత్యాలకు తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన మెరుగని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. హిందూపురం నుండి పేరూరుకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పరిగి సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హనుమంతు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని డాక్టర్ ప్రతిభా తెలిపారు.