కనిగిరి పట్టణంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సోమవారం తెలిపారు. యువకుడి మోటర్ బైక్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మైనర్ బాలికలపై దాడులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.